Header Banner

భారత్- పాకిస్థాన్ కాల్పుల విరమణ వేళ! జై శంకర్ సంచలన వ్యాఖ్యలు

  Tue May 27, 2025 10:57        India

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో పాకిస్థాన్ లో దాదాపు 200 మందికి పైగా మృతి చెందినట్లు భారత రక్షణశాఖ ఇటీవల పేర్కొంది. మరోవైపు భారత్- పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ తన వల్లే జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు చెబుతున్నారు. ఈ క్రమంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు జర్మన్ డైలీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.

 

భారత్- పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ క్రెడిట్ తనదేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ మండిపడ్డారు. భారత్- పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు కారణం భారత త్రివిధ దళాలు అని జై శంకర్ తెలిపారు. భారత త్రివిధ దళాల ధాటిని తట్టుకోలేక పాకిస్థాన్ కాల్పుల విరమణ ప్రస్తావన తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్ర ఏమీ లేదన్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలకు ఈ క్రెడిట్ దక్కుతుందని అమెరికాకు కాదని జై శంకర్ తెలిపారు. కాల్పుల విరమణకు సంబంధించి అమెరికాకు థ్యాంక్స్ చెబుతారా..? అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. " కాల్పుల విరమణకు ఇరు దేశాల ప్రతినిధులు డైరెక్ట్ గా మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందానికి ముందురోజు పాకిస్థాన్ వైమానిక స్థావరాలపై భారత్ సైన్యం దాడులు చేసింది. ఈ దాడుల్లో వారికి తీరని నష్టం వాటిల్లింది. దీంతో ఆ దేశం ఒప్పందానికి వచ్చింది. ఇందులో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే భారత త్రివిధ దళాలకు చెబుతా. వారి పోరాట ప్రతిమ వల్లే పాకిస్థాన్ తల వంచింది" అని విదేశాంగ మంత్రి జై శంకర్ పేర్కొన్నారు.


ఇది కూడా చదవండి:  విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ పోలీసు బాస్‌గా అయన నియమకం! ఇక పూర్తిస్థాయి డీజీపీ!

 

సిరిసిల్లలో ముదిరిన ప్రోటోకాల్ వివాదం..! నేతల అరెస్టుతో ఉద్రిక్తత!

 

అవును ఆ ఇంటికి వెళ్లాను..! వైసీపీ వీడియోపై విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్!

 


లోకేశ్​కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!


ప్రపంచంలో టాప్-10 వైమానిక దళాలు ఇవే! భారత్ స్థానం ఎక్కడంటే?


కేసీఆర్ కు కవితకు మధ్య గ్యాప్ వెనుక కారణం ఇదే! చేసింది అంతా ఆయనే!


ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ.. చేసిన తీర్మానాలు ఇవే!


జంట హత్యల కేసులో ఊహించని ట్విస్ట్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రదర్స్ పై కేసు నమోదు!


రెండు రోజుల పోలీస్‌ కస్టడీకి పీఎస్ఆర్‌, మధు! ఆంజనేయులపై ప్రశ్నల వర్షం..


ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమం!


వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!


నిరుద్యోగులకు గుడ్ న్యూస్! నెలకు 2 లక్షల జీతంతో.. భారీ నోటిఫికేషన్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #BreakingNews #LatestUpdate #Jaishankar #IndiaPakistan #Ceasefire #Diplomacy